జాతీయ సదస్సు తొలిరోజు వేడుక

 

తెలుగు వ్యాకరణములు - పునస్సమీక్ష” అన్న అంశంపై హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారు నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు (సెప్టెంబరు 12,13 తేదీలలో) ఈ రోజు ఉదయం 11.30 ని.లకు ప్రముఖుల సమక్షంలో, ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయింది.

ఈ సదస్సు ప్రారంబోత్సవ సభకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భాషా శాస్త్రవేత్త, పూర్వాశ్రమంలో ఉప కులపతి అయిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు సభాధ్యక్షత వహించారు.

ఈ జాతీయ సదస్సు నిర్వాహకులలో ఒకరిగా వ్యవహరిస్తున్న డా. రేమిల్ల వెంకట రామకృష్ణ శాస్త్రిగారు మాట్లాడుతూ తెలుగులో నన్నయ కాలం నుండి నేటి వరకు ఎన్నో వ్యాకరణాలు వచ్చాయనీ, అయితే, వాటికి సంబంధించిన విశేషాంశాల గురించే కాకుండా, ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన/మారుతున్న నేటి భాషకు అనుగుణంగా ఎలాంటి ఆధునిక వ్యాకరణాలు రావాలన్న విషయాన్ని కూడా చర్చకు పెట్టాలనుకోవడం ఈ సదస్సు ముఖ్యోద్దేశ్యం అన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు తమ ప్రసంగం మొదట్లో హైదరాబాదు విశ్వవిద్యాలయానికి తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తాను ఉప కులపతి (వైస్ చాన్స్ లర్)గా పని చేసిన నాటికి, నేటికీ యూనివర్సిటీ ఎంతో మార్పు చెందిందన్నారు.

వ్యాకరణాల గురించి మాట్లాడుతూ -  సంప్రదాయ వ్యాకరణాలన్నింటినీ చదివాననీ, వ్యాకరణాలపై ఆసక్తి పెరగడానికి తన గురువుగారే కారణమనీ, తన గురువుగారయిన దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు వ్యాకరణ పాఠాన్ని కూడా కావ్య పాఠంలా చెప్పేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే, భాషా శాస్త్రం చదువుకున్నాక వ్యాకరణాలపై అంతవరకూ ఉన్న దృష్టి కోణం మారిందని చెప్పారు.

ప్రాచీనుల, ఆధునికుల దృష్టికోణాలలో వ్యాకరణ ప్రయోజనాన్ని వివరిస్తూ

ప్రాచీనుల దృష్టిలో వ్యాకరణ ప్రయోజనం కావ్యభాషలో సాధు,అసాధు ప్రయోగాలను నిర్ణయిచడానికి, భాషలో ఉచ్చారణ దోషాలను నివారించడానికి పరిమితమైందన్నారు. ఈ సందర్భంగా వ్యాకరణ ప్రయోజనాన్ని గురించి తెలిపే ఒక చక్కని శ్లోకాన్ని ఉదహరించారు.

యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణం

స్వజనః శ్వజనః మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్    

(భావం: నాయనా నీవు శాస్త్రాలు, వేదాలు నేర్వకున్నా మానె కానీ, వ్యాకరణం నేర్చుకో! ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా, సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (మంచి పని) అన్న శబ్దాన్ని శకృత్ (మలం) అని  పలకకుండా ఉండడానికి - అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.)

చిన్నయసూరి కాలానికి కావ్య భాషలో వ్యావహారికం వచ్చినా ఆయన కేవలం కవిత్రయ ప్రయోగాలనే తన వ్యాకరణానికి ప్రమాణాలుగా స్వీకరించాడన్నారు. వీరి కాలం వరకూ (ప్రాచీనుల దృష్టిలో) వ్యాకరణం అంటే ఒక భాషను ఎలా వ్యవహరించాలో తెలుపుతూ రాయబడిన  కొన్ని నియమాల గ్రంథమనీ, అంటే  ఇలా రాస్తేనే వ్యాకరణం అనే అభిప్రాయం ఉండేదన్నారు.

ఆధునికుల దృష్టిలో - ఒక భాషకు రాస్తేనే వ్యాకరణం అనడం సరికాదనీ, మాతృభాషా వ్యవహర్తకు భాషకు సంబంధించిన నియమాలు అంతర్గతంగా తెలిసి ఉంటాయనీ, బాల్యంలోనే  పరిశీలన వల్ల ఇది సాధ్యమవుతుందనీ, ఎంచేతనంటే భాష అంటేనే నియమం, నియతి కలిగి ఉండేది కనుక అన్నారు. దీనినే  చేకూరి రామారావుగారు గుప్త వ్యాకరణం అన్నారని చెప్పారు.

మాతృభాషలో మాట్లాడుతున్నవాడు పండితుడయినా, పామరుడయినా, ఏ ప్రాంతం వాడయినా (మాండలికాలు), ఎవరయినా సరే వాడు పలికే వాక్యం వ్యాకరణ విరుద్ధం కాదని చెప్పారు. ఇక వ్యాకరణాలు చదవడం ఆ వ్యాకర్త ఉద్దేశించినవేమిటో తెలుకోవడానికే అయిఉండాలన్నారు.

సభాధ్యక్షత వహించిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు మాట్లాడుతూ ముఖ్య అతిథి ప్రసంగంలోని కొన్ని విశేషాంశాలపై తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. పరిశోధక విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పత్ర సమర్పణ చేయడానికి ఉత్సాహం చూపించడాన్ని హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జాతీయ సదస్సు అనుకున్న సమయం కంటే కాస్త  ఆలస్యంగా ప్రారంభమవడానికి మార్గాలు కారణమని, ఈ మధ్య కాలంలో భాగ్యనగర మార్గాలు “దుర్మార్గాలు” కావడంతో  ప్రయాణాలు అనుమానాస్పదాలయ్యాయనడంతో సభలో నవ్వులు కురిసాయి. వీరి ప్రసంగం ఆద్యంతం చమత్కారయుతంగా సాగింది.

భోజన విరామానంతరం  ఆచార్య నడుపల్లి శ్రీరామ రాజు గారి అధ్యక్షతన జరిగిన పత్ర సమర్పణ కార్యక్రమంలో అమరేశ్వరం రాజేశ్వర శర్మ, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య సుమతీ నరేంద్ర, ఆచార్య ఉషాదేవి, డా. సంగంబొట్ల నరసయ్య, చుండూరు మాణిక్యం, జాడ సీతాపతి, శ్యామలాంబ తమ పత్ర సమర్పణ చేశారు.

ఈ జాతీయ సదస్సులో  రెండవ రోజు  మరిన్ని పత్ర సమర్పణలు జరగనున్నాయి.

(హైదరాబాదు విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి కేశవాచారిగారి నివేదిక)

                               - తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్య వేదిక పాఠకులకి 60వ స్వాంతత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

అవని ప్రేమ

 డా//అద్దంకి శ్రీనివాస్
హైదరాబాదు విశ్వవిద్యాలయం

గుండె ఒక్కసారిగా తడిసి ముద్దవుతుంది.
వంటి మీద వెంట్రుకలకి కూడా దేశభక్తి ఉందేమో
దేశం పేరు చెప్పగానే నిక్కపొడుచుకొని మరీ
వందనాలర్పిస్తున్నాయి.

చదవుట కొనసాగించు ‘అవని ప్రేమ’

అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ

డా//దార్ల వెంకటేశ్వరరావు,
హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

తొమ్మిది నెలలు నిండక ముందే
ప్రపంచంలోపడిన సంబరంతో
సంకని సంచి తగిలించిన మరుక్షణమే
నా చేతిలో…
పిచ్చుకకు రాబందు రెక్కలొచ్చిన సమాచారం
నమ్మకం నరకబడుతున్నట్లు
నీకు రెక్కలెలా వచ్చాయి
చందమామని వదలి ఉండలేనని
ఒట్టేసుకున్న వెన్నెల

చదవుట కొనసాగించు ‘అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ’

భరతమాత

అండెం శ్రీనివాస్ రెడ్డి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

సీ: పరదేశ సంస్కృతుల్ పసి మొగ్గవలె నుండ 
             పువ్వువైతివి నీవు పుట్టగానె 
     గంగవాణి సిందుత్తుంగ తరంగాన
             తొంగి చూస్తివి నీవు తొల్లినాట 
     అజ్ఞాన తామసిన్ అణచివేస్తివి నీవు
             వేదకిరణముల వెలికి తీసి

చదవుట కొనసాగించు ‘భరతమాత’

నాదు జాతి నాదు దేశము నాదు భాష

డా// అద్దంకి శ్రీనివాస్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

        ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాంటి చైతన్యంతో సాగిన భారత స్వాంతంత్ర్యోద్యమంలో అదే స్పూర్తితో ఆంధ్రులు పోరాడారు. నిండైన దేశ భక్తి అందించిన కొత్త ఊపిరి పోసుకొని తెలుగు కవులు శంఖారావాన్ని పూరించారు. వివిధ ప్రక్రియలను వాహికలుగా చేసుకొని రచనలు చేసి ఉద్యమానికి ప్రేరకులయ్యారు. ప్రజలను దేశం కోసం పాటుపడే విధంగా తయారు చేయడం కోసం, దేశ భక్తిని నూరిపోసేందుకు కవుల కలాలు జోరుగా సాగాయి.

         జాతీయోద్యమ కవిత్వాన్ని పుష్కలంగా రచించిన కవి రాయప్రోలు సుబ్బారావు “నాదు జాతి, నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందు” అని ప్రబోధిస్తూ జాత్యభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికీ నరనరాల్లో జీర్ణించుకుపోయేలా సృజన చేశారు. ఈ స్పృహ తెలుగు సాహిత్యంలో ఆధునిక కాలం నుండే వచ్చింది. అంతకు ముందు సాహిత్యంలో ఈ స్పృహ ఉన్నప్పటికీ దాని లక్ష్యం, పరిధి వేరు. గురజాడ అప్పారావుగారి దేశభక్తి గేయం మొదలుకొని ఈ అభిమాన త్రయాన్ని బోధించే సాహిత్యమంతా ఒక ఉద్యమ స్ఫూర్తితో, చైతన్య దీప్తితో, సంస్కరణాత్మకమూ, ప్రబోధాత్మకమూ అయిన గమ్యం వైపే సాగింది. ఈ నేపథ్యం గల సాహిత్యంలో రాయప్రోలు వారు చెప్పిన మూడు అభిమానాలను స్పృశించడమే ఈ వ్యాసోద్దేశ్యం.

చదవుట కొనసాగించు ‘నాదు జాతి నాదు దేశము నాదు భాష’

నాదు జాతి నాదు దేశము నాదు భాష -2

కవి, సమాజం ఎన్నటికీ వేరు కాదు. రాసేది ధనుర్భంగమనే అంశమే అయినా, నాడు తన చుట్టూ ఉన్న ఉద్యమ స్ఫూర్తి కరుణశ్రీ ‘ఉదయశ్రీ’ కావ్యంలో ఎంత చక్కగా ధ్వనింపజేశాడో చూడండి.
“చెల్లరే విల్లువవిరుచునే నల్లవాడు
పది పదారేండ్లయెల రాచ పడుచువాడు
సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినారు
కనులు గుట్టిన తెల్ల మొగాల వారు”
“’నల్లవాడను’ పదమును భారతజాతీయ వీరునికి ‘తెల్లమొగాల వార’న్న పదమును ఇంగ్లీషు దొరలకు సంకేతముగా గ్రహింపవచ్చున”ని సినారె అభిప్రాయపడ్డారు.

చదవుట కొనసాగించు ‘నాదు జాతి నాదు దేశము నాదు భాష -2′

ప్రపంచ మాండలీకం - గ్లోబిష్!

డా//పమ్మి పవన్ కుమార్
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

     రకరకాల ఆధిపత్యాల నుంచి ఒక్క ఉదుటున బయటపడగలిగే తారకమంత్రం  ఏదీ మన దగ్గర లేదిప్పిడు. వ్యక్తిగానైనా, వ్యవస్థకైనా ఈ సూత్రం పనిచేస్తుంది. ఆధిపత్యం బలవత్తరమయినప్పుడు వ్యక్తులు, వ్యవస్థలు దాని వెంటబడిపోవడం సహజం. కాలక్రమంలో అదెంతటి తిరోగమన శక్తిగా పనిచేయగలదన్న తర్కానికి ఇక్కడ తావు లేదు. మనుగడ కోసం పోరాటంలో అంతా సహజంగానే కనిపిస్తుంది. భావ ప్రసారానికి, భావ గ్రహణానికి వాహికగా  ఉండే భాషల విషయంలోనూ ఇదే జరగబోతుందా? అవుననే అంటున్నారు గ్లోబిష్ ఉదంతం తెలిసిన వారంతా!

చదవుట కొనసాగించు ‘ప్రపంచ మాండలీకం - గ్లోబిష్!’

శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికా విశేషాలు

                                                                           - చాగం కొండారెడ్డి

హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

          కవి సమ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారి సర్వ సాహిత్య సృష్టిలో శిఖరాయమానమైన రచన శ్రీమద్రామాయణ కల్ప వృక్షం. ఈ కావ్యావతారికలో డెబ్బై అయిదు పద్యాలు, వచనాలు ఉన్నాయి. నన్నయ కాలం నుండి కావ్యానికి ప్రారంభంలో అవతారికను రచించటం కవుల సంప్రదాయమైంది. అవతారికలో కృత్యాద్యవస్థ (కృతి+ఆది+అవస్థ) కనిపిస్తుంది. ఒక కావ్య రచనకు పూర్వం ఆ కవి మానసిక స్థితిని తెలియజేసేదే కృత్యాద్యవస్థ. ఈ దృష్టితో తెలుగు కావ్యావతారికలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.

చదవుట కొనసాగించు ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికా విశేషాలు’

నెత్తురింక ఆరలేదు

పసునూరి రవీందర్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

ఈ భూమి సల్లగుండ
కాసిన్ని చినుకులో…
కాసింత నెత్తురో…
తాకితే చాలు…,
వృక్షాలకో,  వీరులకో జన్మనిస్తుంది.

చదవుట కొనసాగించు ‘నెత్తురింక ఆరలేదు’

మాట్లాడే మౌనం

బెల్లంకొండ రవికాంత్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

మాటలంటే నిశ్శబ్ద నదిపై కట్టిన
అనుభవాల వంతెన కదా…!
మాటలంటే అప్పుడే వచ్చిన మొగ్గను చూస్తూ
తల్లి చెట్టు కనే చిగురు కలే కదా…!!
మాటలంటే మౌనం ముఖం పైన
పెదవులు రాసిన అందమైన ప్రేమ లేఖే కదా…!!!
* * *

చదవుట కొనసాగించు ‘మాట్లాడే మౌనం’

తరువాతి కాగితం »


Telugutalli_image

 

జులై 2008
సో_సోమవారం_మొదటి మం బు గు శు
« సెప్టెం    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

మా పాఠకులు